స్టేడియంలో..కోహ్లీ, రోహిత్ ల సతీమణుల సందడి..!

Edari Rama Krishna
ద‌క్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆటగాళ్ల సతీమణులు సందడి చేశారు.  సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 286కు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్‌లో డీన్ ఎల్గర్ 0, మార్క్‌రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23, మ‌హరాజ్ 35, ర‌బాడా 26, మోర్కెల్ 2, పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

 భారత బౌలర్లు  భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలు చెరో వికెట్ లు తీసుకున్నారు.   కాగా, ద‌క్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది.బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 16 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.

అనంతరం 18 పరుగుల వద్ద రెండు, 27 పరుగుల వద్ద మూడో వికెట్లు కోల్పోయింది. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత క్రికెటర్లు తమ భార్యలతో పాటు వెళ్లిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్‌లు వారి మ్యాచ్ ని తిలకిస్తున్నారు.  మొదటి టెస్ట్ జరుగుతుండగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ కెమెరాలో వీరు ముచ్చట్లు చెప్పుకుంటూ చిక్కారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: