భారత్ తో “ఫిక్సింగ్”... పాక్ క్రికెటర్ “షాకింగ్ కామెంట్స్”

Bhavannarayana Nch

మీరు విన్నది నిజమే భారత్ తో మ్యాచ్ ఫిక్స్ చేయమని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కి బుకీలు కాల్ చేసి చెప్పారట..అయితే ఈ తతంగం అంతా ఇప్పటి విషయం కాదు 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడాలని తనను బుకీలు సంప్రదించినట్లు అక్మల్‌ సంచలన విషయాన్ని వెల్లడి చేశాడు.. 2015 ప్రపంచకప్‌లో...భారత్‌తో అదే మాకు తొలి మ్యాచ్‌

 

అయితే ఈ సందర్భంలో నేను వరుసగా రెండు బంతులు ఈ మ్యాచ్ లో వదిలేస్తే బుకీలు దాదాపుగా  రూ.1.3 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారని అక్మల్ తెలిపాడు అయితే గతంలో కూడా అలాంటి భారీ ఆఫర్లు పెద్ద ఎత్తున వచ్చాయి, కానీ వాటిని వద్దని చెప్పానని అలాంటి నీచమైన పనికి నేను దూరం అని తెలిపానని అక్మల్ తెలిపాడు..అంతేకాదు వారికి హెచ్చరికలు కూడాఅ చేశానని తెలిపాడు.

 

అయితే ఈ వ్యాఖ్యల తరువాత ఐసీసీ, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులు వివరణ ఇవ్వాలంటూ అక్మల్‌కు సమన్లు జారీ చేశాయి...2015 ఫిబ్రవరి 15న జరిగిన మ్యాచ్‌లో.... తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50..ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది...ఈ మ్యాచ్ లో భారత్ విజయాని సొంతం చేసుకుంది..ఇదే మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసి జట్టుకి కీలక విజయాన్ని అందించాడు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: