అర్జున అవార్డులను అందుకున్న రహనే, రోహిత్..!
క్రీడా దినోత్సవం సందర్భంగా క్రికెట్ క్రీడాకారులు రోహిత్ శర్మ, అంజిక్య రహనేలకు భారత ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది. అయితే ఆగష్టు 29న జరిగిన ఈ కార్యక్రమంలో వారు విదేశీ పర్యటనలో ఉండటంతో తిరిగి వచ్చిన వీరికి అర్జున అవార్డులను అందించారు. క్రీడా శాఖా మంత్రి విజయ్ గోయల్ ఈ పతకాలను వారికి అందించారు.