సౌత్ ఆఫ్రికా పయనమయిన భారత జట్టు

Krishna Kamal

సౌత్ ఆఫ్రికా పయనమయిన భారత జట్టు 2017 వ సంవత్సరం ను అద్భుత విజయాలతో ఘనంగా ముగించిన భారత జట్టు ఇక విదేశీ గడ్డ మీద తన సత్తాను పరీక్షించుకోనుంది . భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత జట్టు సౌత్ ఆఫ్రికా కు బయలుదేరింది .జనవరి 5 నుండి ఫిబ్రవరి24వరకు మద్య జరిగే 3 టెస్టులు ,6వన్డేలు ,3 T20 లలో సౌత్ ఆఫ్రికా జట్టు తో తలపడనుంది.

సౌతాఫ్రికా బయలుదేరిన విమానంలో భారత జట్టు ఫిజియో ,రోహిత్ శర్మ తో మురళీ విజయ్


 ఇటీవల నెట్టింట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు “విరుష్క”,ఈ నెల 26న ముంబై లో సినీతారలు,క్రీడాకారులు మధ్య రిసెప్షన్ పూర్తిచేస్కొన్న ఈ జంట ఎక్కడ కనిపించినా కెమెరాలు క్లిక్ అని అనాల్సిందే ,బుధవారం పయనమయిన కెప్టెన్ ,నవ వరుడు కోహ్లితో పాటు నవ వధువు అనుష్కశర్మ కూడా బయలుదేరింది.


ముంబై లోని ఛత్రపతిశివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంవద్ద విరాట్ కోహ్లిమరియు అనుష్క శర్మ


2014 ఇంగ్లండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో తన పేలవ ప్రదర్శనతో విదేశీ పిచ్ లపై ఆడలేడు అన్న అపఖ్యాతిని ముటగట్టుకున్న కోహ్లీ ఈ సిరీస్ లో సత్తా చాటి తను మేటికాలంలో అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ అని నిరూపించుకోవాలనుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: