“సింధు” ని ఓడించిన “సైనా”..భారత్ కి మరో “స్వర్ణం”
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కి బంగారు పంటలు పండుతున్నాయి
..ఇప్పటి వరకూ జరిగిన గేమ్స్ లో దాదాపు అన్నిటా భారత్ విజయ దుందుభి
మోగించింది..అంతేకాదు ఎన్నడూ లేనంతగా బంగారు పధకాలు సాదిస్తున్నారు భారత
ప్లేయర్స్..ఇదిలాఉంటే నిన్న జరిగిన బ్యాడ్మింటన్
ఉమెన్స్ సింగిల్స్లో భారత్ కి స్వర్ణం దక్కింది.
బ్యాడ్మింటన్ పేరు చెప్తేనే గుర్తుకు వచ్చేడి సింధు,సైనా ల పేర్లు అయితే ఫైనల్ లో ఈ ఇద్దరు భరత్ క్రీడాకారుణులు తలపడటంతో తీవ్రమైన ఉత్ఖంట మధ్య పోరు సాగింది..చివరిగా ఫైనల్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ విజయం సాధించి... స్వర్ణం దక్కించుకుంది..సింధు రజతంతో సరిపెట్టుకొంది.
ఆధ్యాంతం మ్యాచ్ మొత్తం నువ్వా నేనా అనేట్టుగా సాగింది..ఇద్దరూ కళ్లు చెదిరే స్మాష్ షార్ట్లతో పోటీ పడ్డారు. రెండో సెట్లో హోరా హోరీగా పోరాటం చేశారు...ఎటాకింగ్ గేమ్తో సైనా నెహ్వాల్ సింధుపై 21-18, 23-21 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది...ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మొత్తం 26 స్వర్ణాలకి చేరింది..