"రోహిత్ శర్మ"....సంచలన "కామెంట్స్"...

Bhavannarayana Nch

ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కి ముంబై కి జరిగిన హోరాహోరీ పోరులో ముంబై విజయం సాధించింది...ఈ మ్యాచ్ లో నెగ్గితేనే ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితి అయితే ఇటువంటి కీలక సమయంలో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు తమ సత్తా చాటారు..ఐపీఎల్ సీజన్ -11 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై 13 పరుగుల విజయం సాధించిన సంగతి తెలిసిందే...అయితే  ఇంకా వరుసగా ఆడే 4  మ్యాచ్ లలో అన్నిటా

 

విజయం సాధించవలసిన పరిస్థితి ఉంది అయితే ఈ సందర్భంలో ముంబై ఇండియాన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు..ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. “ఇప్పటికైతే గెలిచాం కానీ.. మా బ్యాటింగ్‌ తీరు చాలా మారాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి అదనంగా 15-20 పరుగులు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. ఓపెనర్లు అద్భుతంగా రాణించినా, మేం అనుకున్న స్కోరును సెట్‌ చేయలేకపోయాం. ఛేజింగ్‌లో కోల్‌కతా తొలి 10 ఓవర్లు ఆడిన తీరు కొంత ఆందోళన కలిగించింది. కానీ ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్నారు. మొత్తానికి బౌలింగ్‌ యూనిట్‌ వల్లే గెలిచాం’ అని రోహిత్‌ అన్నాడు.

 

అయితే టీం మొత్తానికి ఈ గెలుపులో భాగం ఉందని ఇది ఏ ఒక్కరి గెలుపు కాదని తెలిపాడు  ‘‘మిడిల్‌ ఆర్డర్‌లోనూ మాకు ముగ్గురు పవర్‌ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్‌ సత్తాకు ఢోకాలేదు. ఎటొచ్చీ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడమే కావాల్సింది...అయితే ఈ  టోర్నీలో ముంబై ఇండియన్స్‌ కథ ముగుస్తుందనుకున్న వేళ జట్టు సభ్యులంతా ఎంతో పట్టుదలతో ఆడి, ప్లేఆఫ్‌ ఆశల్ని సజీవంగా నిలిపారు.నాకు మా జట్టు పై నమ్మకం ఉందని అన్నారు..జట్టులో  ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయంలో భాగం అవ్వడంతో రోహిత్ శర్మ పాండ్యా ని అభినందించాడు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: