ఇక దేశంలో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టెలికం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించడానికి కూడా బాగా సిద్ధమవుతున్నాయి.ఇంకా అలాగే దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలు సైతం 5జీ స్మార్ట్ ఫోన్లను కూడా లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ జియో కూడా 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే అత్యంత తక్కువ ధరకే 4జీ ఫోన్ను తీసుకొచ్చిన జియో ఇప్పుడు 5జీ ఫోన్ను కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి అందుతోన్న సమాచారం మేరకు జియో 5జీ ఫోన్ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయన్న వివరాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆగస్టు 29వ తేదీన జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీని లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో జియో 5జీ ఫోన్ను లాంచ్ చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను వినియోగదారులకు అందుబాటు ధరలో తీసుకురావాలనే ఉద్దేశంతో జియో కేవలం రూ. 12 వేలకే లాంచ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
అంతకు ముందు లాంచ్ చేసిన జియో 4జీ ఫోన్ మాదిరిగానే రూ. 2500 డౌన్ పేమెంట్ చేసి ఫోన్ను సొంతం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లేను ఇవ్వనున్నారని సమాచారం తెలుస్తోంది.ఇంకా అంతేకాకుండా ఆక్టాకోర్ క్వాల్క్కమ్ స్నాప్డ్రాగన్ 480 సాక్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇంకా అలాగే ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్ను పని చేయనున్నట్లు అంచనా. ఇక కెమెరా విషయానికొస్తే 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా ఇవ్వనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వీటిపై ఓ క్లారిటీ రావాలంటే కంపెనీ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.