వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ప్రతీ ఒక్కరి స్మార్ట్ఫోన్లో కచ్చితంగా ఈ యాప్ ఉండాల్సిందే.ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న మెసేజింగ్ యాప్గా వాట్సాప్కు మంచి గుర్తింపు అనేది ఉంది.అయితే తాజాగా వాట్సాప్ నుంచి భారీగా డేటా లీక్ అయ్యిందన్న విషయం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్లో విక్రయానికి ఉంచినట్లు రావడంతో యూజర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ విషయంతో వాట్సాప్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారింది.అయితే వాట్సాప్ అందించిన కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల సహాయంతో ఈజీగా మన డేటాను సేఫ్ గా ఉంచుకోవచ్చు.మీ వాట్సాప్ అకౌంట్ అనేది మరింత సెక్యూర్గా మారాలంటే ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.ఎన్క్రిప్షన్ ఆన్లో ఉందో లేదో ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. వాట్సాప్ సహజంగా ఎక్క్రిప్షన్ను దానంతటనే అదే ఎనేబుల్ చేస్తుంది. అయితే ఒకసారి స్వయంగా చెక్ చేసుకోవడం చెయ్యాలి. ఇందుకోసం మీరు మెసేజ్ వారికి నెంబర్పై క్లిక్ చేసి ఎన్క్రిప్షన్ ఆప్షన్పై టాప్ చేస్తే సరిపోతుంది.ఇంకా అలాగే మన డేటా భద్రంగా ఉండడానికి వాట్సాప్ అందించిన మరో సెక్యూరిటీ ఫీచర్ ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’. దీనిద్వారా మీరు ఎదుటి వ్యక్తితో చేస్తున్న సంభాషణను ఎవరూ కూడా చూడలేరు.
ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మీరు మెనులోకి వెళ్లాలి. ఆ తరువాత సెట్టింగ్స్పై క్లిక్ చేసి అకౌంట్ సెక్షన్లోకి వెళ్లాలి. ఆ తరువాత మీరు టూ స్టెప్ వెరిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోవాలి.ఇలా మీరు సెక్యూరిటీ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోవడం ద్వారా కొత్త డివైజ్లోకి వాట్సాప్ ఓపెన్ చేయగానే సెక్యూరిటీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మీరు వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. ఆ తరువాత సెట్టింగ్ ఓపెన్ చేసి.. సెక్యూరిటీ నోటిఫికేషన్స్పై క్లిక్ చేసి ‘షో సెక్యూరిటీ నోటిఫికేషన్’ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి.ఇంకా అలాగే వాట్సాప్ సెక్యూరిటీని పెంచుకునేందుకు క్లౌడ్ బ్యాకప్స్ను కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవాలి. దీనివల్ల క్లౌడ్లో స్టోర్ అయిన డేటాను ఎవరూ కూడా యాక్సెస్ చేయలేరు. ఇక ఆ ఫీచర్ను ఆన్ చేయాలంటే.. సెట్టింగ్స్లోకి చాట్స్ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత చాట్ బ్యాకప్పై క్లిక్ చేసి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్పై ట్యాప్చేసి టర్నన్ ఆన్ను నొక్కితో సరిపోతుంది. అయితే దీని కోసం మీరు ఓ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం తెలియని వెబ్సైట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అస్సలు ఓపెన్ చేయకూడదు. ఏమాత్రం డౌట్ అనిపించినా కూడా లింక్ల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఎందుకంటే కొంతమంది సైబర్ నేరగాళ్లు ఈ లింక్లతో యూజర్ల డేటాను ఎక్కువగా కాజేస్తున్నారు.