బుల్లితెర: వర్షిణితో హైపర్ ఆది రొమాన్స్ చూశారా.. వామ్మో అనాల్సిందే?

Durga Writes

హైపర్ అది.. వర్షిణి రొమాన్స్ పీక్స్ లో ఉంటుంది ఈ మధ్యకాలంలో. మరి మితిమీరిపోయారు. గత ఎపిసోడ్ లోనే వామ్మో అని అనిపించినా ఈ జంట ఇప్పుడు మరి దారుణంగా మితిమీరిపోయారు. ఢీ ఛాంపియన్స్ స్టేజ్‌పై వీరి రొమాన్స్ తో మరోసారి దుమ్ము దులిపేశారు. అదిరిపోయే స్టెప్పులతో పాటు రొమాన్స్ ఓ రేంజ్ లో అదరగొట్టారు. 

 

ఇంకా వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదల అవ్వగా కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ''నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం'' అంటూ వచ్చిన ఈ సాంగ్ కి ఓ రేంజ్ లో రొమాన్స్ చేశారు. ఈ రొమాన్స్ చుసిన ప్రియమణి, ప్రదీప్ అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యి నోరెళ్లబెట్టేశారు. 

 

ఇంకా శేఖర్ మాస్టర్‌, పూర్ణలతో పాటు మిగిలిన రష్మి, సుధీర్ ‌లు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ప్రదీప్, రష్మి, సుధీర్‌లు వేసిన ఎంగ్జామ్ సెంటర్ స్కిట్‌లో.. పంచ్‌లు బాగా పేలాయి. ఏది ఏమైనా అప్పట్లో సుధీర్ రష్మీ అతిగా చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ రొమాన్స్ తగ్గింది.. వీరిది దారుణంగా పెరిగిపోయింది. ఇంకా జూలై 8న ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో మీరు ఓ సారి చూసేయండి. 

 

ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో వచ్చే షో స్ లో సినిమాలకు మించిన రొమాన్స్ ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్లు కూడా అంత షో చెయ్యరు.. కానీ బుల్లితెర భామలు చేస్తున్నారు అని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కూడా బుల్లితెరపై డబల్ మీనింగ్ డైలాగులు, రొమాన్స్ మితి మీరుతుంది అనే చెప్పాలి.                          

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/YcDe4ZDtVAw" width="697" height="392" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: