కార్తీకదీపం మౌనిత అస్సలు పేరేంటో తెలుసా..? ఈమె గురించి ఆసక్తికర విషయాలు

Mamatha Reddy
కార్తీకదీపం.. రోజూ సాయంత్రం ఏడున్నరకు  టీవీలో అందరినీ పలకరిస్తుంది. స్టార్ మా లో వస్తున్న ఈ సీరియల్ రేటింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది .  దీప , సౌందర్య, డాక్టర్ బాబు , మోనిత,..ఇలా ప్రతీ క్యారెక్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీప, సౌందర్య, డాక్టర్ బాబు క్యారెక్టర్ లకు ఎంత పేరొచ్చిందో అంతే పేరు ఈ సిరియాలో లో పని చేస్తున్న విలన్ పాత్రాదారి  మోనిత కారెక్టర్ కి కూడా అంతే ఫేమస్. మోనిత గా నటిస్తున్న ఆమె అసలు పేరు శోభా శెట్టి.  కర్ణాకటలోని మంగళూరుకు చెందిన శోభా శెట్టి విలన్ గా కార్తీక దీపం తో ఎంతో  మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సీరియలో ఆమె విలనిజంని బాగా పండించింది. అంతే కాదు ఆమె చేసే కుట్రలు డాక్టర్ బాబుకు తెలియకుండా ఫేస్ లో ఆమె మార్చే ఎక్స్ ప్రెషన్స్ సూపర్ గా ఉంటాయి.  శోభాశెట్టి నటనే కాదు..ఆమె వేసుకునే డ్రెస్ లు కూడా చాలా ఎట్రాక్టివ్ గా ఉంటాయి. మంచి మంచి కలర్ ఫుల్ డ్రెస్ లో అందగా కనిపిస్తుంది.

తెలుగుతో పాటు పలు కన్నడ సీరియల్స్ లోనూ శోభాశెట్టి నటిస్తుంది. తెలుగులో మొదటగా అగ్ని సాక్షి సీరియల్ లో బుల్లితెరపై అరంగేట్రం చేసింది. కార్తీక దీపం సీరియల్ తో పాటు ఈటీవీలో లాహిరి లాహిరి లాహిరి సీరియల్స్ లోనూ శోభా శెట్టి నటించి మంచి పేరు తెచ్చుకుంది. కర్ణాటకలో సైతం ఇటీవలె ఓ సీరియల్ కు సైన్ చేసింది. రుక్కు అనే సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. అది ఓ పల్లెటూరి అమ్మాయి కారెక్టర్. ఈ సీరియల్ ఇటీవలే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫోటోలను శోభాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇక ఈ సీరియల్ లో ఆమె కీ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: