కార్తీక దీపం సీరియల్ లో ఇప్పుడు మళ్లీ ఏడ్పులు మొదలయ్యాయి.. దీప ఆరోగ్య పరిస్తితి పూర్తిగా క్షీణించింది. దాంతో రోజు బాధపడతాడు.. తల్లి సౌందర్య వచ్చి అసలు విషయం చెప్పమని అడిగింది. ఇంట్లో ఏం జరుగుతున్నది? దీప వెనుక ఏం కుట్ర జరుగుతున్నది. దీపను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీ వ్యవహారం మారిపోయింది. అంతకు ముందు నీవు ఒక్క విషయంలో దీపను తప్పుపట్టేవాడివి అంటూ సౌందర్యనిలదీసింది.విజయనగరం నుంచి దీపను తీసుకొచ్చిన తర్వాత ప్రతీ విషయంలోను తప్పుపడుతున్నావు.
ఆ పని చేయవద్దు. ఈ పని చేయవద్దు? వంట చేయవద్దు? ఆ పని చేయవద్దు అంటూ ఆంక్షల మీద ఆంక్షలు పెడుతున్నావు. ఈ కారణం నిన్ను ఇలా రకరకాలుగా వేధిస్తున్నది. ఏ సమస్య నిన్ను ఇంతగా విచిత్రంగా పట్టి పీడిస్తున్నది అంటూ కార్తీక్ను సౌందర్య గద్దించి నిలదీసింది. అయినా కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు.దీప ఇంట్లో జరిగే పూజకు మోనితను, డాక్టర్ భారతీని ఎందుకు తీసుకొచ్చావు. ఇలా ఒకదానికి మరొకటి పొంతన లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకాలం తల్లి లేదని ఓ బిడ్డ.తండ్రి ఓ బిడ్డ బాధపడుతూ బతికారు.
అందరూ కలిసిన తర్వాత ఇద్దరికి తల్లి లేకుండా పోతుంది అంటూ తల్లి భాధను వ్యక్తం చేసింది.. ఇది నిజం కాదని అని బాధపడుతుంది. నీకు నచ్చకపోతే ఇంటి నుంచి బయటకు పంపించు. కానీ నా కోడలు దీప చచ్చిపోతుందని ఎలా చెబుతావురా స్టుపిడ్ అంటూ సౌందర్య భోరున విలపించింది.దీప ఆరోగ్యం విషయం ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. ఈ విషయాన్ని దాచలేక, నిజం చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. దాంతో ఇంతకు దీపకు ఏమైంది అంటూ అడిగితే.. ఈ పేషెంట్ బతకదు.. మొత్తం ట్రీట్మెంట్ పైనే ఉండాలి. ఈ మందులు వాడకపోతే అసలే బతకదు, దీపని బ్రతికించలేము.. అందుకే ఇలా.. ఎటువంటి సంతోషాన్ని చూడని దీప ఇలా జరగకూడదు అని సౌందర్య బాధపడుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..