టీవీ: బిగ్ బాస్-5 లో కంటెస్టెంట్ జెస్సీ గురించి తన తల్లి కన్నీటి గాధ..?

Divya
బిగ్ బాస్-5 ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసింది. ఇక అందులో జెస్సీ అనే ఒక కంటెస్టెంట్ ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ కంటెస్టెంట్ పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోయినా.. బిగ్ బాస్ సడన్ సర్ప్రైస్ తో ఈ కంటెస్టెంట్స్ ను తీసుకు వచ్చింది. కానీ ఇతను కేవలం ఫ్యాషన్,ర్యాంప్ వాక్లో శిక్షణ ఇచ్చి బాగా గుర్తింపు పొందాడు.

ఇక జెస్సీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే నామినేషన్ లిస్ట్ లోకి వెళ్ళాడు. ఇక ఇతను చూడటానికి కాస్త అమాయకంగా ఉండడంతో, అందులో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ అతని ఆడుకోవడం మొదలు పెట్టారు. ఇక ఆనీ మాస్టర్ అయితే ఏకంగా జెస్సి కి చుక్కలు చూపించింది. ఏదో ఒక చిన్న తప్పు చేయడం వల్ల అతని ఒక రేంజ్ లో ఆటాడుకుంది అనీ మాస్టర్.
చివరికి తను ఆనీ మాస్టర్ కాళ్ల మీద పడడం కూడా జరిగింది. ఇక ఈ విషయాలను పక్కన పెడితే ఈ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్ లిస్టులో ఉన్నారు.. అందులో జెస్సీకి ఆదరణ కరువైంది. ఇక ఈ విషయం పై తన తల్లి తన గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.
జెస్సీకి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ కూడా లేదట. తనంతట తాను కష్టపడి అంత మంచి పేరు తెచ్చుకున్నాడు అని తన తల్లి చెప్పింది. అంతే కాదు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడట జెస్సి. అంతేకాదు తన తండ్రి బ్రెయిన్ లో ఏదో తేడా వచ్చి, ఒక్కో పార్ట్ పడిపోయి, మంచంలోనే కొన్ని సంవత్సరాలు గడిపి చివరకు చనిపోయారట. ఇక అదే టైములో తన కెరియర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాడట. దాదాపు ఇన్నాళ్లకు బిగ్బాస్ ఒక అవకాశం ఇచ్చింది.. ఇక ఇదే తన జీవితం అనుకుని వచ్చాడు.. కాబట్టి ప్రేక్షకులు వాడికి సపోర్ట్ చేయాలి ..టాప్ ఫైవ్ లో కచ్చితంగా జెస్సీ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది . అంతేకాదు తన కొడుకుని గెలిపించండి  అంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: