బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

VAMSI
బిగ్ బాస్ సీజన్ 5 లో హౌజ్ ప్రస్తుతం రాను రాను వాతావరణం హాట్ హాట్ గా మారుతోంది. ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యి హౌజ్ మెంబెర్స్ తగ్గే కొద్దీ వారి మధ్య పోటీ మరింత స్ట్రాంగ్ అవుతోంది. దాంతో హౌజ్ లో ఫ్రెండ్షిప్ ల కంటే కూడా మనస్పర్థలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మొదటి నుండి ఎంతో స్నేహంగా ఉన్న సిరి, షణ్ముఖ్ మరియు జెస్సీ లు ఎప్పుడు చూసినా ఒక గ్రూప్ లాగానే కనిపించే వారు. అయితే ప్రస్తుతం జెస్సీ కి షన్ను మీద కోపం రావడం తో జెస్సీ...సిరి మరియు షన్ను లతో సరిగా మాట్లాడటం లేదు. ఇటు షన్ను కూడా జెస్సీ కోపం తగ్గించడానికి కానీ, అతడితో మాట్లాడి కూల్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.

ఈ కారణంగా జెస్సీ మరింత బాధతో కుమిలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన నామినేషన్ కాస్త డిఫరెంట్ గా జరిగింది. బిగ్ బాస్  ఈ వారం ఇంటి కెప్టెన్ గా ఉన్న అని మాస్టర్ కి నలుగురిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా...ఆవిడ నామినేషన్ పై బయట వ్యతిరేకత పెరుగుతోంది. టార్గెట్ చేసినట్లుగా...మొదట టపి టపిమని కాజల్, సన్ని, మానస్ లను నామినేట్ చేసి జైలుకి పంపిన అని మాస్టర్ ఆ తర్వాత నాలుగో వ్యక్తిగా ఎవరిని నామినేట్ చేయాలా అని తెగ హైరానా పడ్డారు..ఎందుకంటే మిగిలిన వారంతా తనతో చాలా సన్నిహితంగా ఉన్నవారే...దాంతో చాలా ఎమోషనల్ అయ్యింది.

ఇక్కడే చాలా మంది ప్రేక్షకులకు అని మాస్టర్ ప్రవర్తన నచ్చలేదు. అప్పటి వరకు టార్గెట్ చేసి మరీ వెంటనే కాజల్, సన్ని, మానస్ లను చేసినట్లుగానే చేసుంటే సరిపోయేది. అంతా ఎమోషనల్ ఎందుకు అయ్యారు మీకు నచ్చిన ఇంటి సభ్యులు కాబట్టే కదా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వైఖరిని ఎప్పటికి మార్చుకుంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: