టీవీ: ఈ నాటికలు చూడడం మావల్ల కాదంటున్న ప్రేక్షకులు.. కారణం..?

Divya
ప్రస్తుతం స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతు ఉన్నాయి.. ఇందులో బాగా ప్రసారమయ్యే సీరియల్స్ లో చాలా సాగదీస్తున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి. గతంలో ఎంతో ఆసక్తికరంగా ఈ సీరియల్స్ ని చూస్తూ ఉండేవారు ప్రేక్షకులు.. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ ని చూడడానికి ప్రేక్షకుల సైతం అంతగా ఆసక్తి చూపలేదు ముఖ్యంగా రుక్మిణి తన భర్తకు ఎప్పుడు దగ్గరవుతుందని ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ రుక్మిణి తన భర్తకు తన బిడ్డ దగ్గర కి చేయాలనుకున్నప్పుడు భార్య భర్తలు కలవారని.. ఇక ఆ కూతుర్ని తన ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది.


అయితే ప్రేక్షకులు మాత్రం ఇందులో మాధవచేసే కొన్ని ప్రయత్నాలు మరింత బోరింగ్ గా అనిపిస్తున్నట్లు ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ఇక దీంతో ఈ సీరియల్ చూసే ప్రేక్షకుల సైతం ప్రతిరోజు సాగదీత ఎక్కువైందని తెలియజేస్తున్నాను రుక్మిణి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ప్రతిసారి మాధవ ఎంట్రీ ఎక్కువగా కనిపిస్తోందని.. ఇక అంతే కాకుండా ఇందులో ఎక్కువగా మాధవాని గెలుస్తూ ఉన్నాడని ఇక వీళ్లు కలవడం అసాధ్యమని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ కూడా టిఆర్పి రేటింగ్ కోసం ఈ సీరియల్స్ ను చాలా సాగదీస్తూ ఉన్నారు.


బహుషా డైరెక్టర్ కు ఏ ట్విస్ట్ పెట్టాలో అర్థం కాక ఇలా సాగదీస్తున్నారని మరికొంతమంది ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టుగానే తండ్రి కూతుర్లను కలిపితే ట్విస్ట్ ఉండదనుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇలా ప్రతి వారం కూడా ఏదో ఒక లింకుతో కథను సాగదీస్తూనే ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ సీరియల్ లో ఆదిత్య తన ఇంట్లో అసలు విషయం చెబితే అక్కడ సరిపోతుంది.. కానీ ఎందుకో డైరెక్టర్ ఒకవైపు ఆదిత్యను చూపించకుండా మరొకవైపు తమ అత్తగారి కుటుంబం నుండి రుక్మిణి కనిపించకుండా చేస్తూ చాలా సాగదీస్తూ ఉన్నారు. అందుచేతని ప్రేక్షకులకు ఈ సీరియల్ అంతగా కనెక్ట్ కాలేకపోతున్నట్లు ప్రేక్షకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: