టీవీ: మొదటిసారి కెవ్వు కార్తీక్ చేసిన పనికి సీరియస్ అయిన ఇంద్రజ..!!
అయితే కొద్దిరోజులు గ్యాప్ తర్వాత తిరిగి గెటప్ శీను తిరిగి వచ్చారు ఇక అక్కడ నుంచి ఈ షో కాస్త స్థిరంగా రేటింగ్ విషయంలో ఉన్నట్లు సమాచారం. దీంతో మరికొంతమంది సుదీర్ రావాలంటే అభిమానుల సైతం కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో జడ్జిలుగా ఉన్న రోజా, మనో కొన్ని కారణాల చేత ఈ షో నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక తర్వాత రోజా ప్లేస్ లో ఇంద్రజ రావడం జరిగింది. ఇక ఇంద్రజ తో పాటు అలనాటి హీరోయిన్ కుష్బూ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నది. తాజాగా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో ఇంద్రజ కెవ్వు కార్తీక్ పైన సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. కార్తీక్ జడ్జిల వల్ల టీం లీడర్స్ పడుతున్న బాధల గురించి స్కిట్ చేయడం జరిగింది. దీన్ని చూసిన ఇంద్రజ జడ్జిమెంట్ ఇవ్వకుండా.. టీం లీడర్ల వల్ల జడ్జిలు కూడా ఎలా బాధపడుతున్నారో స్కిట్ చేసి చూపించండి అంటూ తెలియజేసింది.. దీంతో అప్పుడు ఈ రెండిటికీ జడ్జ్మెంట్ ఇస్తాను అని అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడం ఈ ప్రోమోలో చూడవచ్చు. ఇక తరువాత ఏం జరిగింది అనే విషయంపై ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.