టీవీ: మరో బుల్లితెర జంట బ్రేకప్.. ఎవరంటే..?

Divya
తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ నిఖిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు బిగ్బాస్-8 వ సీజన్లో ఎంట్రీ ఇచ్చి బాగానే పేరు సంపాదించారు. ప్రస్తుతం బిగ్బాస్ 8 వ సీజన్ రెండవ వారం కూడా పూర్తి చేసుకుంది.. కేవలం ఇప్పుడు ఇందులో 12 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో నిజాయితీగానే ఆడి బాగానే పెర్ఫార్మషన్స్ ఇస్తున్నారు. బిగ్ బాస్ లో చాలామంది పోటీ ఇస్తున్నప్పటికీ కూడ తన ఆట తీరుతో మెప్పిస్తున్నారు నిఖిల్.. అయితే నిఖిల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లవ్ బ్రేకప్ లు ఉన్నాయంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

నిఖిల్ కర్ణాటక ప్రాంతానికి చెందిన నటుడు మొదట కన్నడ సినిమాలలో హీరోగా నటించారట. అయితే అక్కడ సరైన సక్సెస్ లో రాకపోవడంతో అవకాశాలు రాకపోవడంతో తెలుగులో బుల్లితెర సీరియల్ ఆయన గోరింటాకు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్రవంతి తదితర సీరియల్స్ లో నటించి నటుడుగా పేరు సంపాదించారు. అలాగే  పలు రకాల టీవీ షోలలో కూడా కనిపించేవారట.

ఈ క్రమంలోనే గోరింటాకు సీరియల్లో నటిచ్చిన కావ్య శ్రీ తో నిఖిల్ కు బాగా పరిచయం ఏర్పడిందట. కావ్య కూడ కర్ణాటక ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఇమే సక్సెస్ అయ్యింది. కావ్య, నిఖిల్ జంటగా కూడా బాగానే ఫేమస్ అయ్యారు.. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో డాన్స్ చేస్తూ వీరిద్దరూ కనిపించడంతో పాటు  షార్ట్ ఫిలిమ్స్, ఫోటోలు, రీల్స్ కలిసి చేయడంతో  వీరిద్దరి మధ్య ఏదో ఉందని వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి.
అయితే నిఖిల్ మాత్రం పెళ్లి విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. చాలా రోజులుగా మేము రిలేషన్ షిప్ లో ఉన్నాము అనే వార్తలు వినిపించాయి.. కానీ కావ్య మంచి అమ్మాయి తను నాకు బెస్ట్ ఫ్రెండ్ గా తను రావడం తనకి చాలా అదృష్టమని తెలిపారు. పెళ్లి అనే విషయానికి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తెలియజేశారు.. ఒకానొక సమయంలో వీరిద్దరూ అన్ ఫాలో కూడా చేసుకున్నారు.. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: