టీవీ: సీరియల్ వల్ల బెదిరింపులు ఎదుర్కొన్న బుల్లితెర నటి.. ?

Divya
తెలుగు బుల్లితెరపై నటి హరిత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇమే ఎన్నో సీరియల్స్ లో నటిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే వెండితెర పైన కూడా పలు చిత్రాలలో నటించింది హరిత.. ఈమె నటుడు జాకి  సైతం వివాహం చేసుకోక అతనితో కలిసి ఎన్నో సీరియల్స్ లో నటించింది. అయితే ఒకానొక సమయంలో సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో తనని కొంతమంది ఫోన్లు చేసి మరి బెదిరించారని రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు కారు ఆపి మరీ తిట్టేవారని తెలియజేసింది. ఈ విషయాలన్నీ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది హరిత.

హరిత ఎవరో కాదు మరొక నటి అయిన రవళికి అక్క అవుతుంది.. అయితే తనకంటే ఎక్కువగానే గుర్తింపు సంపాదించుకున్నది హరిత. సీరియల్స్ లో అమ్మ, అత్త పాత్రలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తమిళ సీరియల్స్ లో కూడా నటించింది. హరిత ఎక్కువగా మొదట్లో విలన్ పాత్రలోనే కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది. గతంలో తాను ఒక సీరియల్స్ లో పాత్రలో నటించడం వల్ల మంచి హిట్ అయిందని కానీ ఆ సీరియల్ తోనే తనకు ఎక్కువగా సమస్యలు వచ్చాయని వెల్లడించింది.

చాలామంది ఆ సీరియల్ చూసిన వారు తన నెంబరు కనుక్కొని మరి ఇంటికి వచ్చి బెదిరించే వారిని.. ఏదైనా చెడ్డ పనులు చేస్తే ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చేవారట.. అయితే వారికి ఎలాగోలా చెప్పి అక్కడి నుంచి బయటపడ్డానని అప్పటి నుంచి తాను విలన్ పాత్రలలో నటించడం చాలా తగ్గించేశానని తెలిపింది హరిత.. టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాక అనుకోకుండా తాను సంఘర్షణ అనే సీరియల్స్ లో నెగిటివ్ పాత్ర పోషించాల్సి వచ్చిందని అప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటూ తెలిపింది. తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఆపి సీరియల్ లో చిన్న పాపని ఏడిపించేది ఈమె అంటూ తిట్టేవారట.. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది. నటుడు జాకీతో వివాహమైన తర్వాత ఎక్కువగానే సీరియల్స్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: