టీవీ: యోగా టీచర్ ను పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి..!

Divya
ఈమధ్య భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలలో కూడా బుల్లితెర నటీమణులు నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తమిళంలో పలు రకాల సీరియల్స్ లో బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులర్ కి సంపాదించుకున్న నటి రమ్య పాండియన్.. అంతేకాకుండా ఈమె 2020లో టెలివిజన్ మోస్ట్ డిజైనబుల్ ఉమెన్ గా కూడా పేరు సంపాదించింది. తమిళ బిగ్ బాస్ సీజన్ -4 లో రన్నర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ యోగ టీచర్ని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రమ్య పాండ్యా డమ్మీ టపాసు అనే చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత జోకర్ అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రమ్య పాండియా ఈమె కట్టు బొట్టుతో భారీగానే ట్రెండు సెట్ చేస్తూ ఉంటుంది. అలా రూఫ్ టాప్ ఫోటోలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె విజయ్ టీవీ విత్ కోమలి అనే షో ద్వారా మరింత క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత పలు రియాలిటీ షోలో జడ్జిగా కూడా చేసిందట.

సినిమాలో అవకాశాలు తగ్గడంతో బిగ్ బాస్ ఓటింగ్ లోకి వెళ్లిన ఈమె అక్కడ కూడా విన్నర్ కాలేకపోయింది. దీంతో అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయాన్ని తీసుకుందట. రమ్య పాండియన్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్నట్లు సమాచారం. ఈమె ప్రేమ వివాహం చేసుకోబోతోంది.. యోగ టీచర్ అయిన లవన్ ధావన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈమె గత ఏడాది శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో యోగా కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడ లవన్ ధావన్ పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారిందట. ఈమె వివాహం వచ్చేనెల 8వ తేదీన రిషికేష్లోని గంగానది ఒడ్డున ఉండేటువంటి ఆలయం దగ్గర జరగబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: