సెల్ఫ్ ఎలిమినేట్ అయిన నాగమణికంఠ.. షాక్ ఇచ్చిన భార్య..!

Divya
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నాగమణికంఠ మొదటి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే మొదటి వారంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనైన మణికంఠ ఆడియన్స్ లో సింపథీ క్రియేట్ చేసుకున్నారు.. చిన్నతనంలోనే తండ్రి మరణించాడని, తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంటే పెంపుడు తండ్రి కారణంగా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయలేక డబ్బులు అడుక్కున్నానంటూ తాను కన్నీరు పెట్టుకోవడమే కాకుండా అందరికీ కన్నీరు పెట్టించాడు.
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ను ఫాలో అయిన ఈయన మొదటి వారంలోనే సింపతి గేమ్ మొదలు పెట్టాడంటూ విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయాలపై నాగమణికంఠ చెల్లెలు ఖండించింది. తమ స్టెప్ ఫాదర్ తమను బాగానే చూసుకున్నాడని, నాగమణి చెబుతున్న మాటలలో నిజం లేదని, తల్లికి దహన సంస్కారాలు నిర్వహించలేని దారుణ స్థితిలో తాము లేమని కూడా తెలిపింది. తన భార్య ,పిల్లలు దూరం అయ్యారని , అత్తమామల ఇంట్లో గౌరవం పొందాలంటే టైటిల్ కావాలి అని ఎమోషనల్ అయినా ఇతడు.. ఇప్పుడు ఓట్ల ప్రకారం గౌతమ్ చివరి స్థానంలో ఉండగా గౌతమ్ కి బదులు తాను వెళ్లిపోతానని హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేసుకుని మరీ ఆరోగ్యం సహకరించడం లేదని బయటకు వచ్చాడు.
అలా బయటకు రాగానే ఘన స్వాగతం లభించింది. తన ఏరియాలో కారు ర్యాలీ చేసిన ఈయన మీడియాతో మాట్లాడాడు. టైటిల్ కొడతానంటూ ఏడు వారాలకి ఎలిమినేట్ అయ్యారు కదా.. ఇప్పుడు మీ భార్య రియాక్షన్ ఏమిటి..?  అసలు ఆమె మిమ్మల్ని కలవడానికి వచ్చారా?  అంటూ అడగగా.. పాపతో ఇంత దూరం రాలేదు కదా అందుకే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే నాకు ప్రియా లెటర్ రాసింది. అదే నా మొదటి లవ్ లెటర్. నాకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగించింది. ఆ కారణంగానే ఆమె నాకు లెటర్ పంపింది. దాన్ని బట్టి చూస్తే ఆమెకు నా పైన కోపం పోయి ప్రేమ పుట్టింది అనుకుంటున్నాను అంటూ తెలిపారు. మరి ఇకనైనా వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: