టివి: చరిత్రలో మొదటిసారి భర్తకే భరణం ఇచ్చిన బుల్లితెర నటి..!

Divya
సిని ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా మారిపోయాయి. చాలామంది తమ భాగస్వామితో మెలగలేక విడాకుల బాటపడుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అయితే 2009లో ప్రేమించి వివాహం చేసుకున్న జయం రవి, ఆర్తి కూడా విడాకులు బాట పట్టారు. అయితే ఆర్తి మాత్రం విడాకులు వద్దనుకున్న జయం రవి మాత్రం విడాకులు కావాలని డిమాండ్ చేయడంతో.. తన భర్త నుంచి తనకు నెలకు 40 లక్షల రూపాయలు విడాకుల భరణం ఇప్పించాలంటు కోట్లు పిటిషన్ వేసింది. దీంతో చాలామంది ఆర్తి నీ ట్రోల్ చేయడం జరిగింది.



అయితే ఇప్పుడు ఒక స్టార్ నటి తన భర్తకి రివర్స్ లో భరణం ఇచ్చినట్టుగా  తెలుస్తోంది. అది కూడా తన కుమార్తె కోసం ఈ ఆస్తిని వదులుకున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి శ్వేతాతివారి. 1998లో రాజా చౌదరి తో వివాహం కాగా.. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆ తర్వాత రాజా ఎక్కువగా మధ్యానికి అలవాటపడడంతో గృహహింసతో తనని ఇబ్బందులు పెట్టేవారని తెలియజేసింది శ్వేతా తివారి. అలా  ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేసింది.


అయితే చివరకు రాజా చౌదరితో విడాకులు సెటిల్మెంట్లో భాగంగా రూ .93 లక్షల విలువైన భవనాన్ని  కూడా ఆమె భరణంగా ఇచ్చేసిందట. తన కూతురు పలక్ తివారి  కోసం ఆర్తిని కూడా లెక్క చేయలేదని వదులుకోవడానికి సిద్ధమయ్యింది. దీంతో ఇలా మొదటిసారి చరిత్రలోనే ఒక నటి తన భర్తకు భరణం కింద డబ్బులు ఇవ్వడం జరిగిందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పైన శ్వేతా తివారి మాట్లాడుతూ తన కూతురు భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని తెలిపింది. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భర్త నుంచి కోట్ల రూపాయలు భరణం పొందుతున్న హీరోయిన్స్ కంటే ఈ నటి బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటీజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: