"ఎయిర్టెల్"...వినియోగదారులకి.."గుడ్ న్యూస్"...!!!!
ప్రస్తుతం టెలికం రంగంలో జియో తో పాటు పోటీ పడుతున్న ఏకైక టెలికం దిగ్గజ సంస్థ
ఎయిర్టెల్. జియో రాకముందు తన ప్రభంజనం కొనసాగించినా, జియో మార్కెట్ లోకి ఎంటర్
అయిన తరువాత మాత్రం తన దూకుడుకు కళ్ళెం పడిందనే చెప్పాలి. అయితే ఎక్కడా తన వినియోగ
దారులు నిరుశ్చాహ పడకుండా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వినియోగ దారుల
మన్ననలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే తన అమూల్యమైన వినియోగ దారులకి ఎయిర్టెల్ గుడ్
న్యూస్ తెలిపింది.
ఎయిర్టెల్ ప్లాటినం వినియోగదారులకి నెలవారీ ప్లాన్లతో పాటు ఇకపై జీ5 ప్రీమియం యాక్సెస్ను అపరిమితంగా ఇవ్వనున్నట్లుగా తెలిపింది. “ఎయిర్టెల్ థ్యాంక్స్” పధకంలో భాగంగా ఈ అదనపు సేవలు అందించనుంది. అయితే ఇన్ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.499,, మరియు ఆపై ప్లాన్లో ఉన్న ఖాతాదారులకి మాత్రమే జీ5 సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలకు పొందే అవకాశం కలిగించింది. ఇందులో జీ5 ఒరిజినల్స్, సినిమాలు, టీవీ షోలు, కిడ్స్ ఎంటర్టైన్మెంట్ వంటిని వీక్షించవచ్చు.
అయితే అందుకు గాను అర్హులైన ప్లాటినం వినియోగదారులు, మై ఎయిర్టెల్ యాప్ లో “ఎయిర్టెల్ థ్యాంక్స్” లోకి వెళ్లి జీ5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిల్వర్, గోల్డ్ యూజర్లకు మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉండవని ఎయిర్టెల్ తెలిపింది.