తమ వినియోగదారులను ఆకట్టునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 108 మెగాపిక్సెల్ కెమెరా సామర్ధ్యంతో, ఐదు కెమెరాలతో సరికొత్త స్మార్ట్ఫోన్ను షావోమి నేడు బీజింగ్లో ఆవిష్కరించింది. ఎంఐ సిరీస్ లో భాగంగానే ఈ ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.
అయితే ఎంఐ సీసీ 9 ప్రో ఫోన్ ధరలు కూడా బాగానే ఉన్నాయి. బేసిక్ వేరియంట్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ ధర రూ .28వేలు ఉండగా, హై-ఎండ్ 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 31వెయ్యి ఉంది. కాగా ప్రీమియం ఎడిషన్ 8జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ ధర రూ .35 వేల రూపాయిలు ఉంది. ఇంత ధర ఉన్న ఫోన్ ప్రత్యేకతలపై ఓ లుక్ వెయ్యండి.
ఎంఐ సీసీ 9 ప్రో అదిరిపోయే ప్రత్యేకతలు..
6.47-అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే,
1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్,
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్,
108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్,
117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా,
2x ఆప్టికల్ జూమ్తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్,
50x డిజిటల్ జూమ్ సపోర్ట్తో 8 ఎంపీ లాంగ్ టెలిఫోటో లెన్స్,
32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్,
5260 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లో ఉన్నాయి.