ఎవరెస్ట్ ఎత్తు ఎంత..? మళ్లీ కొలిచిన చైనా..!!
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనాతి కాలంలోనే.. ప్రపంచదేశాలు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలోనే లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్న చైనా న్యూ రికార్డు క్రియేట్ చేసింది. నేపాల్, చైనా బార్డర్లోని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు మే 1న బయల్దేరిన చైనా టీమ్ బుధవారం శిఖరంపైకి చేరుకుంది. వాస్తవానికి ఎవరెస్ట్ అటు నేపాల్.. ఇటు చైనా సరిహద్దుల్లో ఉంది. రెండు వైపుల నుంచి శిఖరాన్ని ఎక్కవచ్చు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సీజన్లో చైనా కేవలం తమ దేశస్థులకు మాత్రమే ఎవరెస్ట్ ప్రయాణానికి అనుమతించింది.