బుల్లిపిట్ట: వచ్చేవారం నాలుగు స్మార్ట్ ఫోన్లు లాంచ్....! వివరాలు ఇవే....
జియోనీ మ్యాక్స్ కూడా లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. దీని ధర రూ.6 వేల లోనే ఉండనుందని తెలుస్తోంది. ఆగస్టు 25వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ టీజ్ చేసింది. 6.1 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉండనుంది. అలానే రెడ్ మీ 9 ఆగస్టు 27వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..... ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించే అవకాశం ఉంది.
అలానే ఒప్పో ఏ53 2020 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. రూ.15 వేల లోపే దీని ధర ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 25వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండే అవకాశం ఉంది. 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. మోటొరోలా కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యనున్నారు. ఫ్లిప్ కార్ట్ దీన్ని అతి పెద్ద సర్ ప్రైజ్ గా టీజ్ చేస్తుంది. ఇది క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి మిగిలిన వివరాలు ఇంకా తెలియలేదు.