ప్రముఖ దిగ్గజ మొబైల్ సంస్థలలో నోకియా బ్రాండ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా నోకియా మొబైల్స్ అప్పట్లో ఎక్కువగా సేల్ అయ్యేటివి. ఈమధ్య ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినప్పటి నుంచి వీటి హవ కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయినా కూడా తమ కస్టమర్ల కోసం నోకియా సంస్థ పలు రకాలుగా అప్డేట్లను ప్రకటిస్తూ ఆండ్రాయిడ్ మొబైల్స్ ను విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త బడ్జెట్ ఒక స్మార్ట్ మొబైల్ ని భారత్ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.
Nokia c-31 మొబైల్ 6.7 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. త్రిబుల్ కెమెరాతో కూడా ఈ మొబైల్ లభిస్తుంది. ఈ సరికొత్త మొబైల్ సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేకమైన కెమెరాను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొబైల్ నోకియా ఆండ్రాయిడ్ ui నీ అందిస్తోంది అంతేకాకుండా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఫుట్ తో రన్ అవుతుంది. ఈ మొబైల్ ఎడిటింగ్ ఈజీగా చేసేందుకు వీడియోలను ఒక సపరేట్ యాప్ ను కలిగి ఉంది.
Nokia c-31 మొబైల్ నేటి నుంచి అందుబాటులో ఉండనుంది.3gb ram+32 gb స్టోరేజ్ తో ఈ మొబైల్ కలదు.ఈ మొబైల్ ధర విషయానికి వస్తే రూ.9,999 రూపాయలకే అందుబాటులో ఉండనంది.4gb+64 GB స్టోరేజ్ మెమొరీ ఆప్షన్ గల మొబైల్ 10,999 అందుబాటులో కలదు. ఈ మొబైల్ ప్రస్తుతం మూడు కలర్లలో లభిస్తుంది. మొబైల్ టైప్ సి చార్జింగ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. వాటర్ ప్రూఫ్ మొబైల్ గా కూడా ఉండడమే కాకుండా స్టైల్ నాచును కూడా కలిగి ఉంది స్క్రీన్ చాలా థిక్ నెస్ తో తయారు చేయబడినట్లుగా తెలుస్తోంది.10 w ఫాస్ట్ ఛార్జింగ్ పాటు 5000 mah బ్యాటరీ సామర్థ్యం కలదు. ఈ మొబైల్లో సరికొత్త అంగులతో టెక్నాలజీతో ఈ మొబైల్ ఉన్నదని తెలియజేస్తున్నారు.