వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది.స్మార్ట్ఫోన్లో తప్పకుండా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న ఏకైకా మెసేజింగ్ యాప్ వాట్సాప్ కావడం విశేషం.ఇందుకు ప్రధాన కారణం యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడమే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్న ఫీచర్లే వాట్సాప్ను టాప్ ప్లేసులో నిలిపింది.యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించడంతో పోటీ ఎంత ఉన్నా కానీ వాట్సాప్కు మాత్రం అస్సలు యూజర్లు దూరం కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో సూపర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ను కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్లో వాట్సాప్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది.
ఇప్పటికే వాట్సాప్ హెచ్డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు/ వీడియోలను షేర్ చేసుకోవడానికి వీలుగా గతేడాది 2 జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫొటోలు, వీడియోలని ఈజీగా పంపించుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఓఎస్ 'నియర్బై షేర్', ఐఓఎస్ 'ఎయిర్ డ్రాప్' లాగా పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. అది పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో తెలిపింది.ఇక ఇదిలా ఉంటే ఫొటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి చాలా వేగంగా షేర్ చేసుకునేందుకుగాను ‘షేర్ ఇట్’ యాప్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో గూగుల్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్లో నియర్బై షేర్ ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో తాజాగా వాట్సాప్ కంపెనీ నియర్బైకి పోటీగా ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది.