బుల్లిపిట్ట: ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.49,999 లకే..!

Divya
ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే చాలు కచ్చితంగా వాహనాలకు మొబైల్స్ కు ఇతర సామాగ్రి వారు ఆకట్టుకునే విధంగా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా త్వరలోనే దసరా పండుగ రాబోతున్న సమయంలో ఇప్పుడు విద్యుత్ వాహనాల తయారీ సంస్థలలో ఒకటైన ola ఎలక్ట్రిక్ సంస్థ కొన్ని ప్రత్యేకమైన సేల్స్ని ప్రకటించడం జరిగింది. ఇందులో కేవలం రూ.49,999 లకే S-1 ఎలక్ట్రిక్ బైక్ ను 40 వేల రూపాయల విలువైన ఆఫర్లను తీసుకువచ్చింది. మరి వాటి గురించి చూద్దాం.
ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ల హైపర్ ఛార్జింగ్ క్రెడిట్లు, అప్గ్రేడ్ యాక్సరీ సర్వీసెస్, ఇతరత్రా ఆఫర్లను కూడా తీసుకువచ్చింది. నిన్నటి రోజు నుంచి ఈ ఆఫర్లను మొదలు పెట్టింది ఈ ఎలక్ట్రిక్ సంస్థ. ola -S1 ఎలక్ట్రిక్ బైక్ కేవలం 49 ,999 రూపాయలకే అందించబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇది కేవలం లిమిటెడ్ స్టాక్ ఉన్న యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది అన్నట్లుగా తెలియజేసింది. పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం ఓలా ఎలక్ట్రిక్ సీఈవో అలాగే ఎండి భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Ola s-1 2 కిలో వాట్స్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్నది.. ఇందులో 7000 రూపాయలు విలువైన బ్యాటరీ వారెంటీతో పాటు 80 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందట. అలాగే క్రెడిట్ కార్డ్ ఇఎంఐ పైన సుమారుగా 5000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 6000 విలువచేసే UAS అప్ గ్రేడ్ తో లభిస్తుంది. 7000 విలువైన హైపర్ ఛార్జింగ్ క్రెడిట్ ఫ్రీగా కూడా ఇస్తారట. ఇలా మొత్తం మీద చూసుకుంటే ఈ బైక్ కేవలం 49,999 రూపాయలకే కస్టమర్లకు అందించే విధంగా ఓలా సంస్థ ఒక ప్రకటన తెలియజేసింది. మరి ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారు వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: