దీపావళికి బంపర్ ఆఫర్.. లాప్టాప్ కొనాలనుకుంటున్నారా ఇంతకంటే తక్కువ ధరకు ఎక్కడ దొరకదు..?

Pulgam Srinivas
చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం లాప్టాప్ ను ఉపయోగించాల్సి అవసరం వచ్చినా కూడా భారీ ధరల వల్ల వాటిని కొనుగోలు చేయకుండా సమయాన్ని దాటవేస్తూ ఉంటారు. అలా అదే కొంత మంది తక్కువ ధరలో ఏదైనా లాప్టాప్ వస్తే దానిని కొనడానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ లాప్టాప్ లు అంటేనే చాలా ఎక్కువ ధరతో కూడుకొని ఉంటాయి. దానితో కొంత మంది ఆర్థిక స్తోమత లేని వారు లాప్టాప్ లను కొనకుండానే చదువుకొని ముందుకు తీసుకు వెళుతూ ఉంటారు. అలా తక్కువ ధర కలిగిన లాప్టాప్ కోసం ఎదురు చూస్తున్న వారికి జియో సంస్థ అదిరిపోయే దీపావళి బంపర్ ఆఫర్ను ప్రకటించింది.

అసలు విషయం లోకి వెళితే ... రిలయన్స్ జియో పోయిన సంవత్సరం జియో బుక్ 11 అనే ల్యాప్టాప్ ను సరసమైన ధరకు రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు దీపావళి సందర్భంగా దీని ధరను మరింతగా తగ్గించింది. ప్రస్తుతం జియో బుక్ 11 లాప్టాప్ ధర 13000 కంటే చాలా తక్కువ గానే ఉంది. ఈ ల్యాప్టాప్ తక్కువ బడ్జెట్ లో లాప్టాప్ కొనాలి అని చూస్తున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైనా ఈ తక్కువ ధర ల్యాప్టాప్ ను కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లేదా  అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మరియు అమెజాన్ లో కొత్త ధరతోనే ఈ లాప్టాప్ ను కొనుగోలు చేసే వెసులు బాటు ఉంది. ఇక జియో సంస్థ వారు ఈ దీపావళి సందర్భంగా జియో బుక్ 11 లాప్టాప్ పై భారీ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇక ఎవరైనా తక్కువ ధరకు లాప్టాప్ ను కొనుగోలు చేయాలి అని వేచి చూస్తున్న వారికి ఇది గొప్ప ఆఫర్ అనే చెప్పాలి. ఇకపోతే జియో బుక్ 11 Android 4G లాప్టాప్. దీనిలో చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. అలాగే అనేక యాప్లకు కూడా యాక్సెస్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: