ఆసుపత్రి లో బాలింత పై అత్యాచార యత్నం ... ఇంతకంటే దారుణం ఏముంటుంది ?
ఆడవాళ్లకు ఎక్కడ రక్షణ ఎక్కడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది . ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితం మాత్రం శూన్యం . ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు లేకపోగా , ఇంట్లోనూ కొంతమందిపై లైంగిక వేధింపులు తప్పడం లేదు . ఇక ఆసుపత్రులును తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుండటం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాలి . కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని వార్డు బాయ్ ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న మహిళ పట్ల లైంగిక దాడి యత్నించాడు .
సదరు బాధిత మహిళ వెంటిలేటర్ తొలగించాక తన భర్తకు తెలియజేసింది . దీనితో ఆసుపత్రి వర్గాలు షాక్ అయ్యాయి . పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్ మొహిదీపట్నం ప్రాంతంలో నివసించే ఓ మహిళ ప్రసవం కోసం గత నెల 24న బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సెంచురీ ఆసుపత్రిలో చేరింది. 26వ తేదీన ఆమె పాపకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వార్డుబాయ్గా పనిచేస్తున్న గుడిమల్కాపూర్కు చెందిన అచ్యుతరావు (50) ఒంటరిగా ఉన్న బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడడంతో వెంటిలేటర్ తొలగించారు.
దీంతో జరిగిన విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. కోపోద్రిక్తుడైన భర్త నిందితుడిని నిలదీయడంతో గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకోగా బాధితురాలు జరిగిన విషయాన్ని వారికి వివరించింది. దీంతో అచ్యుతరావును అరెస్టు చేసి ఐపిసి సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీ లో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు .