తొమ్మిదేళ్ళ చిన్నారిపై కామదాహన్ని తీర్చుకున్న రైల్వే ఉద్యోగి.. చివరికి..
చట్టాలు మారినా, దిశ లాంటి అమ్మాయిలు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. అయిన కూడా కామాంధుల కామ దాహం మాత్రం తీరలేదు . అమ్మాయిల మీద ఆగాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి... ఒక అమ్మాయిని ఒంటరిగా ఉండటం చూసిన ఎవరైనా కూడా ఎంత ఫ్రెండ్ అయిన కూడా వదలట్లేదు అంటేనమ్మండి..
అసలు వివరాల్లోకి వెళితే.. నేరేడ్మెట్ పరిధిలో ఓ ఘటన చోటుచేసుకుంది.. తొమ్మిదేళ్ల ఓ చిన్నారిపై ఓ కామాంధుడు తన కామ వాంఛనను తీర్చుకున్నారు..అయితే తన ఇంట్లో అద్దెకు ఉంటున్నారు గా అని అభం శుభం తెలియని పసిదానిపై తన కామ కోరికలు తీసుచుకున్నాడు.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నారిపై తన ప్రతాపాన్ని చూపాడు..
నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని పీబీ కాలనీలో ఉంటున్న డి.శ్యాంకుమార్ రైల్వే ఉద్యోగి. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఇతని ఇంట్లో కింది అంతస్తులో కొంత కాలంగా అద్దెకుంటుంది. వారికి 9ఏళ్ల కూతురు ఉంది. శ్యాంకుమార్ భార్య రెండు రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలతో పండుగకు పుట్టింటికి వెళ్లింది. సోమవారం ఉదయం అతడి ఇంట్లో అద్దెకుంటున్న దంపతులిద్దరూ పని మీద బయటకు వెళ్లారు.
అది గమనించిన ఆ మృగాడు...ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను మొదటి అంతస్తులోని తన ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. బాలిక ఆందోళనకర పరిస్థితిలో ఉండడంతో తల్లిదండ్రులు విషయం అడిగి తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యాంకుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు... దీన్ని బట్టి దిశ కేసు జరిగినప్పటి నుండి ఇంకా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..