అమ్మ: ఆస్ది ముద్దు అమ్మ వద్దు!
లక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక కూతురు ఉంది. తల్లికి తిండిపెట్టలేని దీన స్థితిలో అయితే ఆమె బిడ్డలు లేరు. కానీ వృద్ధాప్యంలో తల్లి భారమైంది. 70 ఎకరాల భూమి... ఇతర ఆస్తుపాస్తుల్ని కూడా రక్షిస్తూ వచ్చింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారో ఏమో..? లక్ష్మమ్మ నుంచి ఆస్తిని లాక్కుని పంచుకున్న పిల్లలు ఆమెను మాత్రం రోడ్డుపైకి నెట్టేశారు. పాతికేళ్ళ క్రితమే ఆమె భర్త మరణించాడు. దీంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో నెలకు చప్పున పెట్టుకుని అమ్మని సాకేవారు తర్వాత తర్వాత అందరికీ భారమయిపోయింది ఆ తల్లి. ఆమెకు టైమ్కి అంత ముద్ద పెట్టడం కూడా భారమయిపోయింది ఆ కొడుకులకు. వృద్దాప్యంలో ఉన్న ఆ తల్లిని రోడ్డు మీద వదిలిపెట్టగా బిక్కు బిక్కు మంటూ చెట్టుకింద గడుపుతూ వచ్చింది. ఇది చూసిన స్థానికుల మనసు చెలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నతల్లి మీద కనికరం లేని ఇలాంటి కసాయి బిడ్డలను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.