హెరాల్డ్ స్పెషల్ కర్రీ: ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తయారీ విధానం మీకోసం...!
ఇక ఇప్పుడు పచ్చడి తయారీ విధానం విషయానికి వస్తే.. ముందుగా గోంగూరను తీసుకొని నీటిలో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడికి అవసరమైన అన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని, వాటిని వెడల్పు బాండీలో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో గోంగూర వేసి పైన మూత పెట్టి సన్నని మంటపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా ఉడికించడం ద్వారా ఆవిరికి బాండీలో ఉన్న గోంగూర ఒక ముద్దగా తయారీ దగ్గరకు చేరుకుంటుంది. ఇక ఆ తదుపరి స్టవ్ మీద నుండి వాటిని పక్కకు తీసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత గోంగూర, పచ్చిమిర్చి ముద్దను తీసి మిక్సీలో కాస్త ఉప్పు కలిపి రుబ్బుకోవాలి.
అలా మిక్సీ వేసిన పదార్థాన్ని మళ్లీ పెన్నంలో కాస్త పోపు వేసి అందులో వేయాలి. ఈ పోపు లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్ని కలిసి పెట్టుకోవాలి. ఇలా పోపు గింజలు బాగా రెడీ అయ్యాక మనం మిక్సీలో వేసిన గోంగూర ను అందులో వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ మీద నుండి దించి సమయంలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా సరిపోకపోతే యాడ్ చేసుకుంటూ అందుకు సరిపడా ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుంటే తినడానికి రుచిగా ఉంటుంది. ఇది కూడా సన్నని మంటపై కొద్దిసేపు ఉడికిస్తే చాలా రుచిగా మారుతుంది. ఇంకేముంది మీకు కావాల్సిన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ.