మీ ముఖం రంద్రాలు, మొటిమలతో ఉందా.. !!అయితే ఈ చిట్కాలు మీకోసమే.. !!!

Suma Kallamadi
ఆడవాళ్లని ఇబ్బంది పెట్టె సమస్యల్లో ముఖం  మీద ఉండే చర్మంలో రంద్రాలు పడడం, మొటిమలు రావడం ఒకటి. ఇలా ముఖ చర్మం రంద్రాలు పడితే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ చర్మ రంద్రాలు అలాగే మొటిమలు పోవడానికి ఆడవాళ్లు ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయినాగాని ఫలితం ఉండదు.. ఫలితం మాట ఏమోగానీ ఈ క్రీమ్స్ లో ఉండే కెమికల్స్ వల్ల సమస్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకనే సహజ సిద్ద పద్ధతులతో, మన ఇంట్లో దొరికే పదార్ధాలతో ముఖ చర్మంపై ఏర్పడ్డ రంద్రాలను, మొటిమలను తగ్గించుకోవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.. !!ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించడంలో పుదీనా  బాగా పనిచేస్తుంది.




ఎందుకంటే పుదీనాలో ఉండే మెంథాల్ చర్మానికి చల్లదనన్ని ఇస్తుంది.అందుకనే మొటిమలు, మచ్చలు పోవడానికి పుదీనా ఆకుల్లో రెండు స్పూన్ల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని గుజ్జులాగా అయ్యాక ఈ మిశ్రమాన్ని ముఖం,మెడ భాగాలకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు రాసుకుంటే మంచిది.. కనీసం ఇలా వారానికి మూడు సార్లు అయినాగాని చేస్తే మంచిది ఫలితం ఉంటుంది. అలాగే టమాటో అనేది మన చర్మానికి మంచి టోనర్ లా ఉపయోగపడుతుంది. మొటిమలు, మచ్చలు, పుండ్లు వంటి వాటిని తొందరగా నయం చేస్తుంది. ఒక రెండు లేదా మూడు తాజా టమాటాలను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటో గుజ్జుని మొత్తం ముఖానికి రాసుకుని ఒక పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల చర్మం మీద ఏర్పడే పెద్ద రంద్రాలు క్రమంగా మూసుకుని పోతాయి.




అలాగే ముఖం పై ఎక్కువ మచ్చలు, రంద్రాలు ఉంటే ఆ ప్లేస్ లో కొంచెం టమాటో గుజ్జును రాసి ఒక గంట పాటు ఉంచి కడుకుంటే మచ్చలు తగ్గుతాయి. ఈ టమాటో గుజ్జులో పెరుగు కూడా వేసుకొని ముఖానికి రాసుకోవచ్చు. ఇలా ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మీద ఉండే మృతకణాలు లాగే బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. అలాగే పసుపు కూడా మన చర్మానికి చాలా మంచిది. పసుపులో సహజంగానే ఏంటి బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ పసుపుకి కొంచెం పాలు జోడించి పేస్ట్ లా చేసుకుని ముఖానికి రాసుకుంటే ముఖం కాతివంతంగా మెరిసిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: