కాయగూరల చౌగ్రా
బాణీలిలో నూనె పోసి ఒక్కో రకం కూరగాయ ముక్కల్నీ వేసి అవి సగం వేగేవరకూ వేయించి తీయాలి. బాణీలి లో అరకప్పు నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనెను తీసేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి వేయాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు చల్లి సిమ్లో పెట్టి వేయించిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి.
ఆపై పెరుగు కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి కూరగాయ ముక్కలు పూర్తిగా ఉడికేవరకూ ఉంచాలి. అవసరమైతే మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లాలి. చివరగా మసాలా పొడి చల్లి దించి నిమ్మరసం పిండితే సరి.