కావలసిన పధార్థాలు :
చింతచిగురు : 250 గ్రాములు
కందిపప్పు :1 డబ్బా
ఉల్లిపాయలు : 2
పోపు సామాను: తగినంత
ఉప్పు, పసుపు, కారం, ఇంగువ : సరిపడినంత
తయారు చేయువిధానం :
కందిపప్పు కడిగి తగినన్ని నీరు పోయాలి. దాంట్లో పుల్లలు తీసి శుభ్రం చేసిన చింతపండు, ఉల్లిముక్కలు, పచ్చిమర్చి ముక్కలు వేసి కుక్కర్ లో ఉడికించి దింపాలి. రెండు విజిల్స్ వచ్చాక దించాలి.
తర్వాత బాండిలో 2 గరిటెల నూనె వేసి దాంట్లో ఇంగువ, ఎండుమిర్చి, పోపుసామాను వేసి పోపు పెట్టి ఉడికిన పప్పు వేసి ఉప్పు, పసుపు, కారం వేసి కుత కుత ఉడకుతున్నప్పుడు దింపి సర్వ్ చేయాలి. ఇదే విధంగా చుక్క కూరతో చేయవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: