వైరల్ : చెట్టుకు కోపం వస్తే.. ఇలాగే ఉంటుందేమో?

praveen
దేంతో అయినా పెట్టుకోవచ్చు గానీ ప్రకృతితో అస్సలు పెట్టుకోవద్దు అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రకృతి కి కోపం వస్తే అది సృష్టించే ప్రళయం ఊహకందని విధంగా ఉంటుంది అని అంటూ ఉంటారు.. అయితే ఎవరొ చెప్పడం కాదు ఇప్పటివరకు ప్రకృతికి కోపం వస్తే ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతాయి.. ఎంతటి విపత్తులు సంభవిస్తాయి అన్నది ఎంతోమంది కళ్లారా చూశారు కూడా. అయితే ఇటీవలి కాలంలో మానవ మనుగడకు కారణమైన చెట్లను ప్రతి మనిషి నరికేస్తాడు. ఈ క్రమంలోనే  అడవులను మాయం చేసి ఖరీదైన భవనాలను నిర్మించి అందులో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు నేటి రోజులలో జనాలు.

 ఇలా మనుషులు చేస్తున్న పని చివరికి మానవాళికి ముప్పు తెచ్చే విధంగా మారిపోయింది. ప్రకృతి ప్రళయాలు సృష్టిస్తూ ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ప్రకృతి తన కోపాన్ని ఎన్నో విధాలుగా చూపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే ప్రకృతిలో ఉండే ఒక చెట్టుకూ కోపం వస్తే ఎలా ఉంటుందో అన్న దానికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో ని షేర్ చేశాడు అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే కొంత మంది వ్యక్తులు కలిసి ఒక భారీ చెట్టును నరికేశారు.

 ఇక ఇలా చెట్టును నరికేసిన తర్వాత ఆ చెట్టును పడగొట్టేందుకు పెద్ద గొలుసు ను కూడా ఉపయోగించారు. అయితే ఆ తర్వాత ఇక పక్కనే ఆ చెట్టును పడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ చెట్టు కోపం వచ్చినట్లు గానే అక్కడ సంఘటన జరిగింది.  ఆ చెట్టు నరికేసిన వ్యక్తుల్లో ఒకరిని ఆ చెట్టు తాకి గాల్లోకి ఎగరేసింది. ఆ తర్వాత అతను ఒక్కసారిగా బొక్క బోర్లా పడిపోయాడు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రకృతి పగ పడితే ఇలాగే ఉంటుందేమో అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. అడవులను కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: