చాలా మహిమలు ఉన్న దేవాలయాలు ఎక్కువగా వున్నాయి..ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి అయిన అరసపల్లిలో అద్బుతం జరిగింది.అద్బుత ఘట్టం ఆవిష్కృతమై౦ది. దక్షిణాయణం ప్రారంభం స౦దర్భ౦గా సూర్య కిరణాలు అరసవల్లి ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్ ను తాకాయి.అయితే మబ్బుల కారణంగా గతంతో పోలిస్తే సూర్య కిరణాలు మూల విరాట్ పై పాక్షికంగా ప్రకాశించాయి. రెండు నిమిషాల పాటు స్వామివారి మూల విరాట్ పై సూర్య కిరణాలు ప్రకాశించగా వాటిని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వచ్చారు..