పట్టపగలే తుపాకీ తో ఒక రైతుని కాల్చిన కసాయి యజమాని

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తమిళనాడులో పట్టపగలే  ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. దిండుగుల్ జిల్లా పలానిలో గల వల్లువర్ సినిమా హాల్  యజమాని నటరాజన్.. ఇద్దరు వ్యక్తులను నడి రోడ్డుపై తుపాకితో కాల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కరాయ్‌పట్టీ గ్రామానికి చెందిన రైతు ఇలాంగోవన్‌కు, నటరాజన్‌కు గత కొన్నాళ్లుగా ఒక భూమి విషయం మీద వివాదం  నడుస్తోందట. ఈ విషయం తేల్చుకోవడం కోసం  వాళ్లిద్దరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇలాంగోవన్‌కు అనుకులంగా తీర్పు ఇచ్చింది.


ఈ విషయం పై నటరాజన్ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. అయితే, మంగళవారం ఉదయం నటరాజన్, ఇలాంగోవన్ మధ్య పెద్ద గొడవ జారిందట. దీంతో నటరాజన్ రోడ్డు పక్కన నిలుచున్న ఇలాంగోవన్‌ తో పాటు అతనితో వచ్చిన మరో రైతను తన దగ్గరున్న తుపాకీతో  కాల్చాడు. ఈ ఘటన ఆ ఎదురుగా వున్నా ఒక ఇంట్లోని సీసీటీవీ కెమేరాలో స్పష్టంగా  రికార్డు అవ్వటం జరిగింది. నటరాజన్ కేవలం బెదిరిస్తున్నాడని భావించి వారు.. పెద్దగా భయపడలేదు. కానీ, అతడు నిజంగానే వారిని షూట్ చేశాడు.


దీంతో అక్కడే ఉన్న మరో రైతు నటరాజన్‌పైకి కర్రలు, రాళ్లు విసిరాడు. నటరాజన్ అతడిని కూడా కాల్చేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఆ కాల్చిన వ్యక్తి  నగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: