గుండుతో వున్న తన తన తండ్రిని చూసి ఆ పిల్లలు ఏం చేశారో చూడండి....

Purushottham Vinay
చిన్న పిల్లల గురించి ఎంత చెప్పిన తక్కువ. చిన్న పిల్లలు దేవునితో సమానం. వారు ఏం చేసిన కాని భలే క్యూట్‌గా ఉంటారు కదూ.నిజంగా బాల్యం అనేది చాలా విలువైనది.చిన్న పిల్లలు దేవుడు ప్రశాదించిన వరాలు ఒక్కోసారి చిన్న పిల్లల నవ్వే కాదు..వారి ఏడుపు కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకే కాబోలు.. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.ఇక ఈ క్యూట్ పిల్లల క్యూట్ వీడియో చూసేముందు ఈ స్టోరీ వినండి.సాధారణంగా ప్రతి తల్లి దండ్రులకి కూడా తమ పిల్లల నుంచి మంచి మంచి మరిచిపోలేని క్యూట్ మెమోరీస్ ఉంటాయి. ఆ పిల్లలకు కూడా వారు పెద్దయ్యాక ఆ మెమోరీస్ మంచి ఆనందాన్ని ఇస్తాయి.అప్పుడప్పుడు వారు ఆ క్యూట్ మెమోరీస్ ని ఫొటోస్ రూపంలోనో వీడియో రూపంలోనో చూసుకొని ఎంతో సంతోషపడుతుంటారు.


సాధారణంగా ఇలాంటి మరిచిపోలేని మెమోరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.జోనాథన్ నార్మోయిల్ అనే టిక్ టాక్ యూజర్ తన కొత్త లుక్ కోసం గుండు గీసుకున్నాడు. క్లీన్‌ షేవ్ చేసి మీసాలు, గెడ్డం తీసేశాడు. ఆ తర్వాత సోఫాలో కూర్చున్న తన కవల పిల్లల వద్దకు తన రూపాన్ని చూపించాడు. ‘‘హాయ్ ఏం చేస్తున్నారు?’’ అని అడిగాడు. ఆ పిల్లలు తమ తండ్రిని గుర్తుపట్టలేకపోయినా.. గొంతును కనిపెట్టారు. కానీ, అతడు క్లీన్ షేవ్ చేసుకుని అపరిచితుడిలా కనిపించడంతో కాసేపు గందరగోళానికి గురయ్యారు.ఈ సందర్భంగా కవలల్లో ఒక పాప ఏడ్వడం మొదలుపెట్టింది. అయితే, రెండో పాప మాత్రం షాక్‌తో అలా చూస్తూనే ఉండిపోయింది.


మొదటి పాపను ఓదార్చేందుకు తండ్రి చేతులు ముందుకు చాపగా.. తన సోదరిని ముట్టుకోవద్దు అన్నట్లుగా రెండో పాప.. చేయి అడ్డంగా పెట్టింది. అనంతరం ఆమె కూడా ఏడుపు మొదలుపెట్టింది. జోనాథన్ ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. ఆ పిల్లల ఏడుపు చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు. దీంతో వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్ మంది వీక్షించారు.ఇది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో వీక్షించబడుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది...




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: