కుంచె పట్టి చిత్రాలు గీస్తున్న పంది... వైరల్ గా మారిన ఆ పెయింటింగ్స్..?
సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ అనే ఓ మహిళా స్థానికంగా ఫామ్ శాంక్చ్యూరీని నిర్వహిస్తోంది. లెఫ్సాన్కు 2016లో జంతువధశాలలో వరాహం కనిపించడంతో ఆమె అక్కడ నుంచి ఆ పందిని కాపాడి తన శాంక్చ్యూరీకి తీసుకెళ్ళింది. కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్న ఆ పందిలో ప్రతిభను గుర్తించిన లెఫ్సాన్ దానితో పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. అందుకు ఆ వరాహం కూడా నోటితో కుంచే పట్టుకొని ఎంతో అద్భుతంగా బొమ్మలు గీయడం నేర్చుకుంది.
ఆ వరాహానికి"పిగాసో"అనే పేరును పెట్టి ఆ పేరుమీదుగానే పిగాసో వేసిన పెయింటింగ్స్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేది. ఈ క్రమంలోనే ఈ పెయింటింగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ పిగాసోకి పెయింటింగ్స్ వేయడం కోసం ఉపయోగించే కలర్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం లెఫ్సాన్ సహజంగా తయారు చేసిన రంగులను వాడడం విశేషం. ఇక పిగాసో గీసిన పెయింటింగ్స్ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
పిగాసో పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లెఫ్సాన్ ఆ ఫోటోలను వేలంపాటలో పెట్టింది. ఈ విధంగా పిగాసో గీసిన బొమ్మలను అమ్మడం ద్వారా ఏకంగా రూ.2,89,768 రూపాయలు రావడంతో ఆ డబ్బునంతటిని లెఫ్సాన్ జంతు సంరక్షణ కేంద్రానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎంతో అద్భుతంగా పెయింటింగ్ వేస్తున్న ఈ పిగాసో కూడా సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా మారిపోయింది.