కరోనా నిబంధనలను ఉల్లంగించినందుకు జైలు శిక్ష..
ఇక అటువంటి వారి కోసమే ఈ వార్త. కరోనా నిబంధనలు పాటించనందుకు ఒక వ్యక్తికి ఏకంగా 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకోండి.కఠినమైన కరోనా మహమ్మారి నిర్బంధ నియమాలను ఉల్లంఘించినందుకు గాను అతని పరిచయాల మధ్య వైరస్ వ్యాప్తి చేసినందుకు గాను ఒక వ్యక్తికి వియత్నాం దేశంలో ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది.వియత్నాం దేశం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఆ దేశానికి చెందిన లె వాన్ ట్రై (28) అనే వ్యక్తికి ప్రజా కోర్టులో విచారణ తర్వాత ప్రమాదకరమైన అంటు వ్యాధులను వ్యాప్తి చేసినందుకు గాను దోషిగా తేలడం జరిగింది.దీంతో అతనికి అక్కడ శిక్ష విధించడం జరిగింది.ఇక అక్కడ ఇతని ఒక్కడికే కాదు ఇలాంటి ఆరోపణలపైన ఆ దేశంలో మరో ఇద్దరు వ్యక్తులకు కూడా 18 నెలల అలాగే రెండు సంవత్సరాల సస్పెండ్ జైలు శిక్షని విధించడం జరిగింది.