అద్భుతం.. వీళ్ళ తెలివికి ఒక లైక్ వేసుకోండి..

Satvika
ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. మహా పురుషులు అవుతారు అన్నది ఊరికే అనలేదు.. అందుకు తగ్గట్లు కూడా కొందరు జనాలు రుజువు చేస్తున్నారు. ఎన్నెన్నో కొత్త కొత్త వాటిని కనిపెడుతూనే ఉన్నారు. అబ్బురపరిచే వాటితో అందరితో భళా అని అనిపించుకుంటున్నారు.. పెరుగుతున్న సైన్స్ కారణంగా దేశం అభివృద్ధి బాట లో పరుగులు పెడుతోంది.. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అయితే అద్బుతమైన ఫలితాన్ని అందిస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. వ్యవసాయపు పంటలు అనేవి భూమిలో మాత్రమే వేస్తారు. ఇది ఎప్పటి నుంచో వింటున్నారు. అందుకు భిన్నంగా హైదరాబాద్ వాసులు కొత్త ప్రయోగాత్మకంగా మొక్కలను, కూరగాయలను పండిస్తున్నారు. మట్టి లేకుండా కేవలం నీటిలోనే పంటలను పండించే ఈ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తోంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా పెరిగే ఆర్గానిక్ కూరలను తీసుకోవడం తో పాటుగా ఇంట్లోనే లేదా ఇంటి చుట్టూ వున్న ప్రాంతాల్లొ పెంచుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా తక్కువ ఖర్చుతో పని మొదలవుతుంది. అందుకే పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళు కూడా శని, ఆదివారాల్లొ ఇలా చేస్తున్నారు. ఇది ఒక హాబిగా పెట్టుకొని చెయ్యడం అంటే మామూలు విషయం కాదు..


కరోనా కారణంగా ఇళ్లకే పరిమితం అయిన చాలా మంది ఇలాంటి కొత్త ఆలోచనలు చేసి అందరి ప్రసంసలు అందుకున్నారు.ఇలాంటి కూరగాయలు, ఆకు కూరలకు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఇలాంటి వాటితో పంటలను పండిస్తున్నారు. ఈ హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ పద్ధతిలో పంటలు వేయడం కోసం మట్టి అసలే అవసరం లేదు..కేవలం నీటితో మాత్రమే తక్కువ స్థలంలో వీటిని వేసుకొవచ్చు.కొబ్బరి పీచు తో ఇలాంటి పంటలను వేసి అధిక లాభాలను అందుకున్నారు హైదరాబాద్ వాసులు.. ఇలాంటి ఐడియా రావడం చాలా గ్రేట్.. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: