ఫోన్ పే నుంచి ఉచితంగా 5 లక్షలు.. ఎలా అంటే..?

Purushottham Vinay
డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే కస్టమర్స్ కి గుడ్ న్యూస్ ని అందించింది. నీతి ఆయోగ్‌తో ఫోన్‌పే చేయి కలిపింది.ఇక ఇందులో భాగంగా హ్యాకథాన్ నిర్వహించబోతోంది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే..ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌లో మార్పులు తీసుకు రావాలని హ్యాకథాన్ ని తీసుకురానున్నారు. అయితే దీని వలన ఇన్నోవేటర్లకు ఇంకా డిజిటల్ క్రియేటర్లకు ఇంకా అలాగే డెవలపర్లకు దీని వల్ల మంచి అవకాశం ఉంటుంది.ఇక ఈ హ్యాకథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి రూ.5 లక్షల వరకు ప్రైజ్ మనీ అనేది ఇస్తారట. అలాగే విన్నింగ్ టీమ్‌కు రూ.1.5 లక్షలు వరకు లభిస్తాయి. రెండు ఇంకా మూడు స్థానాల్లో వస్తే వారికి వరుసగా రూ.లక్ష ఇంకా అలాగే రూ.75 వేల చొప్పున అందజేస్తారు. అలానే ఇతరులకి కూడా ప్రైజ్‌లు అనేవి ఇందులో ఉండొచ్చు.


రిజిస్టర్ చేసుకోవడానికి ఫిబ్రవరి 23 వ తేదీ వరకు అవకాశం వుంది.ఎంట్రీస్ తుది గడవు విషయానికి వస్తే ఫిబ్రవరి 25 వ తేదీగా నిర్ణయించారు. ఇక అలాగే విన్నర్లను ఫిబ్రవరి 28 వ తేదీన ప్రకటిస్తారు. ఓపెన్ డేటాను ఏపీఐలు ఉపయోగించి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఆర్థిక సేవలు తీసుకు రావాలని వారు అనుకుంటున్నారు. అలానే రుణాలు, బీమా ఇంకా అలాగే ఇన్వెస్ట్‌మెంట్లకు సంబంధించిన ప్రత్యామ్నాయ రిస్క్ మోడల్స్ ఇంకా అలాగే ఆర్థిక సేవలను విస్తృతంగా వినియోగించేలా పవర్ డేటా సిగ్నల్స్‌ ని ఉపయోగించే వినూత్న ఉత్పత్తులు ఇంకా అలాగే డిజిటల్ చెల్లింపుల డేటాను ఆధారంగా చేసుకొని మెరుగైన విజువలైజేషన్ ఇంకా డెరైవ్డ్ ఇంటెలిజెన్స్ వంటివి హ్యాకథాన్‌ లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.


ఇక ఫోన్ పే పల్స్, ఓపెన్ గవర్నమెంట్ డాటా ప్లాట్ ఫామ్ ఇంకా అలాగే పేమెంట్స్‌పై ఆర్‌బీఐ రిపోర్ట్‌లు వంటి వాటిని హ్యాకథాన్‌లో పాల్గొనే వారు ఉపయోగించచ్చు.అలాగే సేతు ఏఏ శాండ్ బాక్స్ లేదా సేతు పేమెంట్స్ శాండ్ బాక్స్ ని వినియోగించి వాటి ద్వారా కూడా హ్యాక్స్‌ను డెవలప్‌ చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఇంట్రెస్ట్ వున్న వారు త్వరగా దీనిలో పార్టిసిపేట్ చెయ్యండి. అద్భుతమైన ప్రైజ్ మని గెలిచి మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: