10వ తరగతి విద్యార్థులకు హైఅలర్ట్ విధించిన తెలంగాణ సర్కార్..!!

Divya
ఈ సంవత్సరం మే నెలలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 6వ తేదీన రాష్ట్ర విద్యా సంచాలకుల కార్యాలయంలో ఆమె అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు.. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యం కావడంతో పదవ తరగతి పరీక్షలను ఈసారి కేవలం ఆరు పేపర్లతోనే ముగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.


ఇకపోతే పరీక్ష సమయాన్ని మరో అరగంట సేపు పెంచామని మొత్తం సిలబస్ లో కేవలం 70 శాతం లో ప్రశ్నలు ఉంటాయని అధికంగా కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి అని అలాగే పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.. పల్లె ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి " మన ఊరు - మన బడి " మళ్ళీ ఏర్పాటు చేశామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాల రూపురేఖల్లో మార్పు కల్పించాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 8వ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఇంగ్లీష్ మాధ్యమాలలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయులందరికీ,  అవసరమైన శిక్షణను కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇకపోతే టెట్ పరీక్ష నిర్వహణలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్  పూర్తిగా తెలుసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: