వైరల్ : బైక్ను ఢీకొట్టిన డిఎస్పీ కారు.. అతన్ని డిక్కీలో వేసుకుని మరి?

praveen
సాధారణంగా పోలీసులు అంటే ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ ఉండాలి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం కొంత మంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది  పోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చివరికి అమాయక ప్రజల ప్రాణాల మీదికి తెస్తూ ఉంటారు.  ఖాకీ యూనిఫాం ఉంటే చాలు తాము ఏం చేసినా నడిచిపోతుంది అన్న చందంగా వ్యవహరిస్తూ ఉంటారు అన్నది ఎన్నో రోజుల నుంచి వస్తున్న విమర్శలు.  ఇక ఇటీవల జరిగిన ప్రమాదం చూస్తే ఇప్పటివరకు పోలీసుల పై వచ్చిన విమర్శలు నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది.



 ఇటీవలే ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. దేవరకొండ డిఎస్పి నాగేశ్వరావు రూల్స్ కు మినహాయింపు అన్నట్లుగానే వ్యవహరించారు అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఆయన వాహనం మునుగోడు వెళుతూ ఉంది. అయితే యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కి చెందిన ధనుంజయ  ఇక   ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మునుగోడు మీదుగా చండూర్ వెళ్తున్నారు ధనుంజయ. అయితే బోదంగిపర్తి  శివారులో టర్నింగ్ వద్ద ధనుంజయ వాహనాన్ని డిఎస్పీ కార్ దారుణంగా ఢీకొట్టింది.


 ఓవర్ స్పీడ్ కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టూవీలర్ ఢీకొట్టడం  తో ఒక్కసారిగా ధనుంజయ టు వీలర్ పైనుంచి ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇది పొరపాటుగా జరిగిన యాక్సిడెంట్ అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కూడా పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా బాగాలేదు. ప్రమాదానికి గురైన వ్యక్తిని అంబులెన్స్లో  తీసుకెళ్లకుండా పోలీసు వాహనం డిక్కీలో  తీసుకెళ్లారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డిఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్  లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: