గద్దర్ చనిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసా..?
అనంతరం గుండె ఆపరేషన్ కూడా జరిగిందని అంతా బాగానే ఉందని వైద్యులు కుటుంబ సభ్యులు సైతం తెలియజేసినట్లు సమాచారం. అయితే అలాంటి గద్దర్ ఒకసారిగా మరణించాలనే వార్త తెలియజేసి అందరికీ షాక్ గురి చేశారు. అసలు గద్దర్ మరణించడానికి గల కారణాలను డాక్టర్లు సైతం తమ మాటలను తెలియజేసినట్టు తెలుస్తోంది. వైద్యులు తెలియజేస్తూ గద్దర్ గుండె ఆపరేషన్ తర్వాత కోలుకున్నారని అయితే ఈ రోజున ఉదయం తెల్లవారుజామున ఆయనకు ఒక్కసారిగా బిపి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది అని.
బీపీని కంట్రోల్ చేసే సమయంలో అతని సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి ఒకవైపు బీబీ పెరగడం మరొకవైపు షుగర్ లెవలు తగ్గిపోవడంతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని తెలిపారు..ఇదే సమయంలో అతని శరీరంలోని పలు అవయవాలు కూడా స్పందించడం మానేశాయని ముఖ్యంగా కిడ్నీ, లివర్ పనిచేయడం మందగించిందని ఇలాంటి క్రమంలోనే 12 గంటలలోనే మల్టీ ఆర్గానిక్ ఫెయిల్ అయి ఈ రోజున మధ్యాహ్నం గద్దర్ కన్నుమూశారని తెలియజేశారు. అయితే గద్దర్ మరణ వార్త విని ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలోని నాయకులు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు. గద్దర్ లేరని తెలిసి పలువురు అభిమానులు కూడా తీవ్ర శోకసముద్రంలోకి మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన జ్ఞాపకాలను అభిమానుల సైతం నెమరు వేసుకుంటున్నారు.