దేశవ్యాప్తంగా మరొకసారి లాక్ డౌన్..!!

Divya
2020.. 21 లో యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ ఒక్కసారిగా విలయతాండవాన్ని సృష్టించింది.. బహుశా ఈ తరం వాళ్లు ఈ కరోనా లాక్ డౌన్ కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేరని కూడా చెప్పవచ్చు విస్తృతంగా కరోనా కేసులు మరణాలు సంభవించడం వల్ల ప్రపంచ దేశాలతో పాటు ఇండియా కూడా లాక్ డౌన్ విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో రెండుసార్లు లాక్డౌన్ ని అమలు చేయడం జరిగింది.. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మరొకసారి దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈసారి అందుకు కారణం మాత్రం కరోనా వైరస్ కాదట అంతకుమించి ప్రాణాంతకమైన వైరస్ నిఫా వైరస్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిఫా వైరస్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది.కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా మరి కొంతమంది కూడా దీని బారిన పడినట్లు సమాచారం. అయితే ఈ నిఫా వైరస్ కి వ్యాక్సిన్ లేకపోవడంతో పాటు ఎలాంటి చికిత్స కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టు వేయలేకపోతోందట కేరళ ప్రభుత్వం. అందుకే కేరళలో అప్పుడే ఆంక్షలు విధించారని తెలుస్తోంది.


వారం రోజులపాటు విద్యాసంస్థలు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా మూసివేశారని అంతేకాకుండా రద్దీగా ఉండే ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ థియేటర్ల పైన కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చాలా చోట్ల లాక్డౌన్ కూడా విధించడంతోపాటు ఈ నెల 24వ తేదీ వరకు స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఫా వైరస్ కోవిడ్ కన్నా చాలా ప్రమాదమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమస్త హెచ్చరిస్తున్నది. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 3 పర్సెంట్ మాత్రమే ఉంటే మీ పాస్ ఓకేనా వారిలో 40-70 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ లో తేలినట్లు తెలిపారు. ఒకవేళ ఇది ఎక్కువగా వ్యాపిస్తే లాక్ డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: