ఏపీ: మరో ఉదాంతం.. భర్తతో యువతిలపై అత్యాచారం చేయిస్తున్న భార్య..!

Divya
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లల పైన హత్యాచారాలు మహిళల పైన అత్యాచార కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా అత్యంత దారుణమైన పరిస్థితులలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో సొంత అన్న వదిన తమ కూతుర్లను కూడా చంపేశారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇవన్నీ మరువక ముందే తిరుపతిలో ఇప్పుడు మరొక దారుణం జరిగింది.. ఒక కిలాడి దంపతులు యువతుల జీవితాలతో  చలగాటమాడుతూ దొరికిపోయినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా బాధ్యతలు సైతం పోలీసులు ఆశ్రయించడంతో ఒక్కసారిగా వీరు గుట్టు రట్టు అయింది. నగరంలో ప్రముఖ యూనివర్సిటీలో BL చివరి సంవత్సరం చదువుతున్న ప్రణవి,కృష్ణారెడ్డి జంట  కర్నూలుకు చెందిన తన స్నేహితురాలైన ఒక యువతికి గత రెండేళ్లుగా గంజాయికి అలవాటు పడేలా చేశారు. హాస్టల్లో ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పి తరచూ తమ ఇంటికి తీసుకు వెళ్లేదట ప్రణవి.. అయితే గంజాయి మత్తులో ఉన్న యువతిని సైతం తన భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించి మరి వీడియోలు తీస్తూ ఉండేదట.

ముఖ్యంగా యువతి పైన అత్యాచారం చేసిన వీడియోలను తీసి యువతి అన్నకు , కాబోయే భర్తలకు ఈ కిలాడి భార్య భర్తలు సైతం పంపించే వారట. అలా ఆ యువతి కుటుంబాన్ని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారట. దీంతో బాధితులు సైతం ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగా పోలీసులు కూడా రంగంలోకి దిగి ఈ కిలాడి భార్య భర్తలను కూడా అరెస్టు చేసి మరి రిమాండ్ కు తరలించారు.. అయితే గతంలో కూడా ఈ జంట ఒక యువతిని మోసం చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్లు పోలీసులు విచారణలో భాగంగా తెలియజేశారు. మరి కొద్ది రోజులలో పూర్తి వివరాలు తెలియజేసి బాధితులకు తగిన న్యాయం చేస్తామంటూ కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: