ఏపీ: ఆగని హత్యలు..భర్త చేతిలో బలైన ఇల్లాలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన అత్యాచారాలు, హత్యలు చిన్నపిల్లల పైన హత్యలు, హత్యాచారాలు వంటివి దాడులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలలుగా ఏపీలో ఇదే తంతు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాల ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. విడాకుల విషయంలో గొడవ వల్ల భార్యను భర్త నరికి చంపేసినట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో రామానజపురం అనే గ్రామానికి చెందిన గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు సూర్యచంద్ర, సాయిలక్ష్మి కి గత కొద్దిరోజులుగా గొడవలు ఉన్నాయని వీరికి 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యిందట.

కానీ 10 సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యచంద్రం పైన సాయిలక్ష్మి కూడా దగ్గర్లో ఉండే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. అయితే పోలీసులు సైతం వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసారట. కానీ చివరికి వీరిద్దరూ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. ఈ కేసు కొనసాగుతున్న సమయంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో.. సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకి వస్తూ ఉండగా సూర్యచంద్ర ఆవేశంతో ఇంట్లో ఉండే కత్తిని తీసుకువచ్చి ఆమె మెడ పైన చాలా విచక్షణ రహితంగా నరికారట.

దీంతో ఆమె రోడ్డుపైన అక్కడికక్కడే మరణించినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ సంఘటన పోలీసులకు గ్రామస్తులు తెలియజేయగానే హుటాహుటిగా ఆ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సైతం పోలీసులు పరిశీలించగా సూర్యచంద్ర ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హత్య చేసిన సూర్యచంద్ర ఇంటి ముందే తన భార్యను చంపి కత్తి పట్టుకొని కూర్చొని ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే తమ కుమార్తెను మాత్రం సూర్యచంద్ర ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని కూడా బాధితురాలు తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. మృతురాలి తల్లితండ్రులు అన్న సైతం సూర్యచంద్ర పైన పలు రకాల ఆరోపణలు చేశారు. డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో అటు సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: