'చై' పై కవిత్వం... వైరల్ అవుతున్న శోభితా ధూళిపాళ్ళ పోస్ట్...!

FARMANULLA SHAIK
అక్కినేని ఫ్యామిలీ ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురువారం కేవలం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు అంటూ గతంలో అనేకసార్లు వార్తలు వినిపించాయి.. కానీ ఆ వార్తలన్నీ కూడా ఆవాస్తవాలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ వార్తలపై అటు శోభిత కానీ, ఇటు నాగచైతన్య అతని ఫ్యామిలీ కానీ స్పందించలేదు. దీంతో అవన్నీ ఒట్టి వార్తలే అని అనుకున్నారు. అయితే తాజాగా నిన్నటి నుంచి మరొకసారి వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియా లో మారుమోగడంతో పాటు ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుక జరగనుంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి.కానీ ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ శోభిత, నాగచైతన్య ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుకతో ఒక్కటయ్యారు. చాలా కాలంగా రహస్య ప్రేమను కొనసాగించిన వీరిద్దరూ ఎట్టకేలకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం చేశారు. అయితే వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మొదట అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత మొదటి నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలే కదా, ఆ వార్తలనే వారు నిజం చేశారు అంటే కొంతమంది లైట్ తీసుకున్నారు.  తాజాగా కింగ్ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఏంగేజ్మెంట్ ను జరుపుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..
నాగార్జున సోషల్ మీడియా లో ఫోటోలు రిలీజ్ చేశారు.నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా శోభిత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది."నా తల్లి మీకేమి కాదు.. నా తండ్రి మీకు ఏ బంధువు కాదు. నేను, నువ్వు ఎలా కలిసినా.. కానీ ప్రేమలో మన హృదయాలు ఎర్రటి భూమిపై వర్షం కురుస్తున్నట్లుగా ఉన్నాయి. విడిపోవడానికి మించి కలిసిపోయాయి” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవిత్వంతోనున్న పోస్ట్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు శోభిత ధూళిపాల.. తెనాలిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి అయినప్పటికీ హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.అలాగే బాలీవుడ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా హీరోయిన్ గా చేసింది.అలాంటి ఈ హీరోయిన్ ఒకసారి జాక్ పాట్ కొట్టేసింది.సమంతా నాగచైతన్య విడిపోయిన తరువాత నాగచైతన్య శోభతో కలిసి డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. కొంతమంది అయితే ఇప్పటికీ సమంతా నాగచైతన్య విడిపోవడానికి కారణం శోభిత అనే నమ్ముతారు. కానీ శోభిత తరువాత నాగచైతన్య జీవితంలోకి వచ్చిందని నాగచైతన్య సన్నిహితులు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నిన్న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఒకటయ్యారు, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: